?పాతనిబంధనలోను, ధర్మశాస్త్రములోను, పరిశుద్ధ గ్రంధము నందు రెండవ పుస్తకమై ఉన్నది

?నిర్గమకాండమును 3 భాగములుగా విభజించవచ్చును

?ఇశ్రాయేలీయుల అద్భుతమైన విడుదల (1-13)

?సీనాయి కొండ దగ్గరకు అద్భుతమైన ప్రయాణము (13-18)

?సినాయి కొండ దగ్గర అద్భుతమైన ప్రత్యక్షతలు (19-40)

?రెండవ భాగము నందు నాలుగు ప్రధానమైన సంఘటనలు కలవు

?దేవుని యొక్క అద్భుతమైన విడుదల శక్తిని హెబ్రీయులు చూచుట (13-15)

?దేవుడు తన పిల్లలను ఎలా పోషిస్తారనేది అనుభవించుట (15-17)

?వారి శత్రువులైన అమాలేకీయుల నుంచి రక్షించబడుట (17)

?ప్రజల మధ్య సమాధానము ఉంచుట కొరకు నాయకులను ఏర్పాటు చేయుట (18)

?మూడవ విభాగము నందు మూడు ముఖ్యమైన విషయములు కలవు

?పది ఆజ్ఞలు ఇచ్చుట అవి ప్రజల జీవితంలో ఎలా నెరవేర్చడం అనే సూచనలు వివరముగా తెలియజేయుట (19-23)

?ప్రత్యక్ష గుడారము, దాని పరికరములు ఎలా చేయాలి అని సూచనలు ఇచ్చుట (25-31)

?ప్రత్యక్ష గుడారము దాని పరికరములు తయారుచేసి నిలువబెట్టుట, దేవుని యొక్క సన్నిధి గుడారమును నింపుట (35-40)

?తనతో నిబంధన కలిగినటువంటి జనులను దేవుడు ఆశీర్వదిస్తారు అనే విషయం నిర్గమకాండము మనకు తెలియచేస్తుంది

?దేవుడు తనకు ఏవి అంగీకారమో వివరంగా తెలియజేశారు

?ఆదికాండము, నిర్గమకాండము మధ్య 300 సంవత్సరములు యెడము ఉన్నది

?ఇశ్రాయేలు ఒక దేశంగా ఎలా ఉద్భవించింది అనేది నిర్గమకాండము తెలియజేస్తుంది

?నిర్గమకాండము బాధతో మొదలై విడుదలతో అంతమవుతుంది

?నిర్గమకాండము యాకోబు సంతతి ఐగుప్తులో విస్తరించుట దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారము  నిలువ బెట్టుట వరకు సుమారుగా 431 సంవత్సరములు  చరిత్ర కలిగి ఉన్నది

?ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు గొప్ప సామ్రాజ్యముగా ఎదిగినది

?మోషే లేవీయుడు

?ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరు సమయమునకు 20 సంవత్సరములు పైబడిన వారు స్త్రీలు, పిల్లలు కాక ఆరు లక్షల మంది ఉన్నారు

?సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరారు

?ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావటానికి దేవునికి ఒక్క రాత్రి మాత్రమే పట్టినా ఐగుప్తు వారి హృదయంలో నుంచి తీసివేయటానికి 40 సంవత్సరాలు పట్టింది

?నిర్గమకాండముతోనే మోషే యొక్క కథ కూడా మొదలవుతుంది

?మోషే గురించి బైబిలు మొత్తం మీద 1/7 శాతము ఉన్నది

?మోషే యొక్క చరిత్ర క్రొత్త నిబంధనతో పోల్చుకుంటే 2/3 శాతము ఉన్నది

?ఐగుప్తీయులు హాము సంతతికి చెందినవారు

?50 మంది పక్కన నిలబడితే సుమారుగా 40 మైళ్ల పొడవు ఉంటుంది గంటకు రెండున్నర మైళ్ళ వేగంతో ప్రయాణిస్తే ఒక చోటు దాటటానికి ప్రజలందరికీ కలిపి 16 గంటలు పడుతుంది

?పశువులు కాకుండా ప్రజలకు ఆహారము నీరు అందించడానికి 30 రైలు బోగీల ఆహారము, 300 ట్యాంకర్ల నీరు ప్రతిరోజు 40 సంవత్సరముల  ప్రయాణములో అవసరమవుతుంది.